Friday, May 17, 2024

తెరాస తోనే తెలంగాణ..- జెడ్‌పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్‌

కోరుట్ల రూరల్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పా-టైందని కోరుట్ల జెడ్‌ పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్‌ అన్నారు. తెరాస 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం మాదాపూర్‌ గ్రామంలో పార్టీ పతాకాన్ని టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పడ్డ టిఆర్‌ఎస్‌ రాజకీయ పోరాటాల వల్లనే రాష్ట్రం సిద్ధించిందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణారెడ్డి, సింగిల్విండో చైర్మన్‌ గడ్డం ఆదిరెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ తోట నారాయణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర సాధన లో టిఆర్‌ఎస్‌ పార్టీ ముందుండి పోరాడి రాష్ట్రం సాధించిందన్నారు. ఈకార్యక్రమంలో టీ-ఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు బాస గంగారెడ్డి, వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్‌ కటకం రాజేష్‌, జి పి కో ఆప్షన్‌ సిరిపురం గంగారం, నాయకులు వెంకటేష్‌, గంగాధర్‌, ఇబ్రహీం, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement