Saturday, May 4, 2024

దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

శ్రీ దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ.. దొడ్డి కొముర‌య్య చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. నేటి యువ‌త మ‌హ‌నీయుల‌ను ఆద‌ర్శంగా తీసుకుని ముందుకు సాగాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement