Monday, May 6, 2024

పెద్దపల్లి జిల్లాలో 9మంది తహసీల్దార్ల బదిలీ

పెద్దపల్లి, ఆగస్టు 2 (ప్రభన్యూస్‌): పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 9 మంది తహసీల్దార్‌లకు వివిధ మండలాల్లో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. కొమ్రం భీం ఆసిఫాబాద్‌లో పనిచేస్తున్న పి.రామ్మోహన్‌రావును అంతర్గాం తహసీల్దార్‌గా, మంచిర్యాలలో పనిచేస్తున్న ఎం.జ్యోతిని పాలకుర్తికి, మంచిర్యాలలో పనిచేస్తున్న ఎం.వాసంతిని రామగిరికి బదిలీ చేశారు.

అలాగే జగిత్యాలలో పని చేస్తున్న జె.స్వర్ణను ఎలిగేడుకు, జగిత్యాలలో పనిచేస్తున్న ఎండీ బషీరోద్దీన్‌ను జూలపల్లికి, కరీంనగర్‌లో పని చేస్తున్న ఎ. రజితను సుల్తానాబాద్‌కు, కరీంనగర్‌లో పని చేస్తున్న డి.రాజయ్యను మంథనికి, కరీంనగర్‌లో పని చేస్తున్న పి.రాజ్‌కుమార్‌ను పెద్దపల్లికి, మంచిర్యాలలో పని చేస్తున్న జి.కుమారస్వామికి రామగుండం తహసీల్దార్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement