Thursday, May 2, 2024

మానేరు వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామంలోని మానేరు వాగు లో ముగ్గురు గల్లంతయ్యారు. శుక్రవారం వేములవాడకు చెందిన ఎనిమిది మంది యువకులు మానేరు వాగు లో ఈత కోసం రాగా అందులో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఐత రాజు పల్లి గ్రామానికి చెందిన మనోజ్, అశ్వంత్, వేములవాడకు చెందిన రాహుల్ మృతి చెందారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement