Monday, May 6, 2024

ఆలయ అభివృద్ధి కోసం కృషి..

ఓదెల: మండల కేంద్రంలోని కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయం శంబులింగేశ్వర స్వామి శివాలయం శిథిలావస్థకు చేరుకోగా రూ. 2లక్షల తన స్వంత ఖర్చులతో ఇదే గ్రామానికి చెందిన గ్రామ కోఆప్షన్‌ డాక్టర్‌ కనికిరెడ్డి సతీష్‌ అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో గ్రానైట్‌, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకుడు దూపం నాగేంద్ర, మాజీ సర్పంచ్‌ ఆకుల మహేందర్‌, ఉప సర్పంచ్‌ తీర్థాల కుమారస్వామి, వార్డుసభ్యులు తీగల సదానందం, ఐలయ్య, నర్సింగం, బోయ సదానందం, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు పోలోజు రమేష్‌, జిల్లా డైరెక్టర్‌ నరేష్‌, పోశెట్టి, సదానందచారి, మార్క రవి, సురేష్‌, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement