Monday, April 29, 2024

బీసీలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం : మంత్రి గంగుల

బీసీల‌కు అండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఉంటుంద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. వేల కోట్ల విలువగల 82.30 ఎకరాల భూములను ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడానికి హైదరాబాద్ నడిబొడ్డున కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం ఉప్పల్ బగాయత్‌లో సోమవంశ సహస్రార్జున క్షత్రియ (పట్కర్) ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అండగా ఉందన్నారు. గ‌త పాల‌కులు బీసీల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, తెలంగాణ క్షత్రియ సమాజ అధ్యక్షుడు విశ్వనాథ్ రవీందర్. ప్రతినిధులు శ్రీనివాస్ కోడే, రామ్ చందర్, షికారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement