Wednesday, March 27, 2024

cycle yatra : ఘ‌నంగా స్వాతంత్ర్య వ‌జ్రోత్స‌వాలు..

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ‘హైదరాబాద్ సైకిల్ గ్రూప్’ చేపట్టిన ‘తిరంగా సైకిల్ యాత్ర’ను శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ సైకిల్ గ్రూప్ సభ్యులు 350 మంది స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా.. కుత్బుల్లాపూర్ నుంచి 100 కిలో మీటర్ల సైకిల్ యాత్రను హైదరాబాద్౼నాగపూర్ జాతీయ రహదారిపై (NH-44) పై చేపట్టారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళ్తున్న స్పీకర్ పోచారం మెదక్ జిల్లా చేగుంట సమీపంలో ఈ సైకిల్ యాత్ర చూసి తన కాన్వాయ్‌ని ఆపి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను దేశ ప్రజలు తమ సొంత పండుగలా జరుపుకుంటున్నారు. ఇది ఏ కులానికో, మతానికో, ప్రాంతానికో సంబంధించినది కాదు. భారతీయులందరి పండుగ అన్నారు. దేశ భక్తితో ఈ యాత్రను చేపట్టిన సైకిల్ గ్రూప్ సభ్యులను స్పీకర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement