Monday, April 29, 2024

నిరాడంబరంగా రాములోరి కళ్యాణం..

ఎల్లారెడ్డిపేట: శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతా రాముల కళ్యాణ వేడుకలు మండలంలోని పలు గ్రామాల ఆలయాలలో నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి మండలంలో అనేక గ్రామాలలో విజృంభించిన సందర్భంగా ఆలయాలలో భక్తులు లేకుండానే అర్చకులు శ్రీ సీతారాముల కళ్యాణం జరిపారు. మండలంలోని నారాయణపూర్‌, అల్మాస్‌పూర్‌ గ్రామాల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాల్లో, బొప్పాపూర్లోని మూడు గుళ్ళ ఆలయంలో ఎల్లారెడ్డిపేటతో పాటు పలు గ్రామాలల్లోని ఆలయాల్లో సీతారాముల కళ్యాణ వేడుకలు ఆలయ పూజారులు, పండితులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, కొద్ది మంది ప్రజలతో నిరాడంబరంగా నిర్వహించిన స్వామి వారి కళ్యాణం కరోనా నిబంధన మేరకు భక్తులు లేకుండా జరిగింది. కరోనా బారి నుండి ప్రపంచ ప్రజలను కాపాడి ప్రజలు అనందంగా ఉండేలా కటాక్షించమని శ్రీ సీతారాములను ప్రజలు వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement