Friday, April 26, 2024

మల్లన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం..

ఓదెల: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్‌ నిబంధనల ప్రకారం భక్తులకు ప్రవేశం కల్పించకుండా అర్చకులు, సిబ్బంది పరిమిత సంఖ్యలో కళ్యాణోత్సవాన్ని జరిపించారు. అలాగే ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు దేవాలయంలో ఆర్జీత సేవలు, దైవ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement