Sunday, May 5, 2024

సంపత్‌రెడ్డి సంతాప సభ..

గోదావరిఖని: ఆర్జీ1 ఏరియా పరిధిలోని జీడికే 2ఏ గనిలో ఎస్‌డిఎల్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న చింతకుంట్ల సంపత్‌ రెడ్డి అనారోగ్యంతో అకాల మరణం చెందగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గని గుర్తింపు సంఘం సెక్రటరీ దొర గాండ్ల మల్లయ్య ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్థకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కీలక పాత్ర వహించారని, మైన్స్‌ కమిటీ- నాయకుడిగా కార్మికుల పక్షాన హక్కుల సాధనకు కృషి చేశారన్నారు. ఆయన కుటు-ంబానికి అండగా నిలబడతామన్నారు. ఈకార్యక్రమంలో అధికారులు గ్రూప్‌ ఏజెంట్‌ శ్రీనాథ్‌, గని మేనేజర్‌ సాయి ప్రసాద్‌, సెక్షన్‌ ఇన్చార్జ్‌ తాటిపాముల శంకర్‌తోపాటు- వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మైన్స్‌ కమిటీ-, సేప్టీn కమిటీ-, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement