Sunday, May 5, 2024

కార్మిక వ్యతిరేక కోడ్‌ ప్రతుల దహనం..

గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్‌ కోడ్‌ కాపీ ప్రతులను సింగరేణి సంస్థ ఆర్జీ1 పరిధిలోని జీడీకే 1, 2, 2ఏ, 11 ఇంక్లయిన్‌, సీఎస్‌పీ1, ఏడబ్ల్యుఎస్‌లో సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులు దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఎం. సారయ్య, మెండె శ్రీనివాస్‌, వేణుగోపాల్‌రెడ్డి, ఆసరి మహేశ్‌, కారం సత్తయ్య, వంగళ రామన్న, కృష్ణ, లక్ష్మణ్‌, నంది నారాయణ, రవి, ఆరెపల్లి రాజమౌళి, గజేంద్ర, అన్నం శ్రీనివాస్‌, దేవేందర్‌, బుగ్గారం శ్రీనివాసరావు, ఇప్పలపల్లి సతీష్‌, రమేశ్‌, బూరుగుల రాములు, శివరాంరెడ్డి, కుంభం కిషన్‌, కృష్ణారెడ్డి, రాయమల్లు, శంకర్‌, దుర్గప్రసాద్‌, మేరుగు రాజయ్య, బలుసు రవి, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement