Thursday, May 2, 2024

Peddapalli: పేదల గుండెల్లో గులాబీ జెండా.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి, ఆగస్టు 16 (ప్రభన్యూస్‌): తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా చిరస్థాయిగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుల్తానాబాద్‌ మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా, గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే దాసరి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఎన్నటికీ మరిచి పోలేరన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం.. ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో ఛత్రపతి యువసేన సభ్యులు హరీష్‌, క్రాంతి, శ్రీనివాస్‌, అనిల్‌, అన్వేష్‌, వంశీ, వెంకటేష్‌, సుధాకర్‌, శంకర్‌, రవితేజ, అరుణ్‌, రాజేష్‌, కనుకేష్‌, రాహుల్‌, రాజు, రమేష్‌, సంపత్‌, అజయ్‌, అభిషేక్‌, చంద్రశేఖర్‌, కిరణ్‌, కుమార్‌, రవి, సాయి, చందు, రవీందర్‌, మహేష్‌, నరేందర్‌, అఖిల్‌, పండులు ఉన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్‌ చందర్‌ రావు, ఏఎంసీ ఛైర్మెన్‌ బుర్ర మౌనిక శ్రీనివాస్‌, కన్వీనర్‌ మైలారం నారాయణ, సర్పంచ్‌ వసంత మోహన్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ ఆవుల వెంకటేష్‌, మాజీ సర్పంచ్‌ రాజ కొమురయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లంగి సదయ్య, బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement