Monday, May 6, 2024

అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో.. బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం..

పెద్దపల్లి, ప్ర‌భ‌న్యూస్ : ప్రార్థనా మందిరాలను కూల్చివేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద గల రాజీవ్ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు రాస్తారోకో నిర్వహించి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం మసీదులను ప్రార్థనా మందిరాలను కూల్చివేయాలనడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నిరసనలో తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం, బిఎస్పీ, సిపిఐ తో పాటు పలు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement