Sunday, May 5, 2024

Breaking : ఆటోని ఢీకొట్టిన వ్యాన్‌, న‌లుగురికి తీవ్ర గాయాలు..

శ్రీ‌కాకుళం జిల్లాలో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. కొత్తూరు మండలం నివగాం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో.. వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో మీదకు వ్యాన్ దూసుకురావడంతో ఆటోలో ఉన్న‌ డ్రైవర్ తోసహా నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎస్ ఐ చంద్రకళ తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement