Saturday, May 11, 2024

క్వారంటైన్‌ కేంద్రం..

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా 8వకాలనీ జీటీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని జీఎం వెంకటేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా జీటీ హాస్టల్‌లో ఉద్యోగుల కోసం 40 పడకలతో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని వసతులు కల్పిస్తూ డిస్పెన్సరీ వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తారన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని కోరారు. స్వచ్ఛమైన నీరు, వేడినీటి కేటిల్‌, ఆవిరి వ్యాపరైజర్‌ ప్రతి ఒక్క గదిలో ఉంటుందన్నారు. పోషకాహారం కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, అధికారులు సాంబయ్య, రాధాకృష్ణారావు, డాక్టర్‌ రమేశ్‌బాబు, ధనుంజయ్‌, ఎర్రన్న, మురళీకృష్ణ, ప్రదీప్‌కుమార్‌, రాజేశ్వర్‌, పీవీ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement