Sunday, April 28, 2024

కార్మికుల సమస్యలు..

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఓసీపీ3లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి కందునూరి రాజరత్నం డిమాండ్‌ చేశారు. 8వ కాలనీ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోల్‌ బ్రాంచి నుంచి ఈసీఎస్‌పీ వరకు సింగిల్‌ రోడ్‌ ఉండడం వల్ల డంపర్‌లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అలాగే ట్యాంకర్ల పరిస్థితిని కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఏమాత్రం శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రమాదాలు జరిగితే ఎవరు కారణమని, కార్మికులపై నెట్టివేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర తిరుపతి, ఎండీ రఫీ, సత్యం, రవీందర్‌ రమేశ్‌, రాజులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement