Thursday, May 2, 2024

రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేత

రైతు సంక్షేమ‌మే ధ్యేయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్ర‌వారం కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు తన సొంత డబ్బులతో రైతులకు టార్పాలిన్ క‌వ‌ర్ల‌ను అందిస్తుండగా ఐకేపీ కేంద్రంలో రైతులకు మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగ పడే విధంగా మధు ఈ కార్యక్రమాన్ని తీసుకోవ‌డం పట్ల మంత్రి అభినందించారు. రైతు సంక్షేమం కోసం ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇలా అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement