Monday, April 29, 2024

కరీంనగర్ లో ప్ర‌ప్రథమంగా ప్రతిష్టాత్మక నుమాయిష్..

ఫిబ్ర‌వ‌రి 15 తర్వాత నిర్వహించడానికి సన్నాహాలు

తెలంగాణతో పాటు యావత్ దేశంలో పేరెన్నికగన్న నుమాయిష్ త్వరలో హైదరాబాద్ కు దీటుగా ఎదుగుతున్న కరీంనగర్ లో ప్రప్రథమంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను మినిస్టర్ క్వార్ట‌ర్స్ లో కలిసి ఈ అంశంపై చర్చించారు. 82 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఇప్పటి వరకూ హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల ఈ ఎగ్జిబిషన్ ను కరీంనగర్ లో నిర్వహించనుండడం విశేషం. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెంది, తీగల వంతెన, మానేరు రివర్ ప్రంట్, ఐటీ టవర్స్ వంటి ఇతర అభివృద్ధి పనులతో ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న కరీంనగర్ లో నుమాయిష్ నిర్వహించాల్సిందిగా గతంలో మంత్రి గంగుల ఇచ్చిన ఆహ్వానం మేరకు నేడు నుమాయిష్ సభ్యులు మంత్రిని, ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ని కలిశారు. జనవరి 1 నుండి ఫిబ్ర‌వ‌రి 15 వరకూ హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 82వ నుమాయిష్ ను నిర్వహిస్తున్నారు. తదనంతరం ప్రభుత్వ సహకారంతో కరీంనగర్ లో నిర్వహించడానికి ప్రతిపాధనలపై చర్చించారు. దీంతో కరీంనగర్ ప్రజలకు అత్యద్బుత ఎగ్జిబిషన్ అనుభవం సాకారం కానుంది. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ మార్గం, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ డా. ప్రభాశంకర్, సెక్రటరీ సాయినాథ్ దయాకర్, సభ్యులు వీ.జయరాజ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement