Friday, April 26, 2024

టీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను ఈరోజు ఉదయం పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు ఎంపీ పర్యటనను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఎంపీ అరవింద్ ను కోరుట్ల నియోజకవర్గంలో అడ్డుకోవాలని సోమవారమే మండల టీఆర్ఎస్ నాయకులు ప్రణాళిక సిద్ధం చేశారు.

టీఆర్ఎస్ నేతల ప్రణాళికను ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఎంపీ పర్యటన సజావుగా సాగేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటల నుంచే అరెస్టులు చేశారు. ఎంపీ పర్యటన ముగిసిన తర్వాత నేతలందర్నీ వదిలిపెడతామని పోలీసులు అన్నారు. అరెస్టయినవారిలో ఎంపీపీ తోట నారాయణ, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవ అధ్యక్షుడు దరిశెట్టి రాజేష్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు చీటి వెంకట్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement