Tuesday, May 7, 2024

దప్పిక తీర్చేందుకే చలివేంద్రాలు

మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సత్యసాయి బాబా ట్రస్టు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా కూడలి వద్ద సత్యసాయి బాబా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం  మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారాన్నారు. పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతం ప్రజలు వివిధ పనుల్లో బయటకు వచ్చిన సందర్భంలో మంచినీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇల్లందుల కృష్ణమూర్తి, సత్యసాయిసేవాసమితి సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement