Monday, May 6, 2024

దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు

మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జండా కూడలితోపాటు పోలీస్ స్టేషన్ సమీపంలో చలివేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారాన్నారు. పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతం ప్రజలు వివిధ పనుల్లో బయటకు వచ్చిన సందర్భంలో మంచినీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలు ఉపయోగపడతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement