Monday, April 29, 2024

Peddapalli: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.. రోడ్డు మంజూరు పట్ల హర్షం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిల చిత్రపటాలకు పెద్దబొంకూరు గ్రామస్తులు పాలాభిషేకం నిర్వహించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో సర్పంచ్ కారుపాకల మానస సంపత్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పాలాభిషేకం నిర్వహించి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.

పెద్దబొంకూరు నుండి మియాపూర్ వరకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు తారురోడ్డు నిర్మాణం కోసం మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి గ్రామస్తులంతా మద్దతు ఉంటారన్నారు. రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికవ్వడం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పెద్దపల్లిలో గులాబీ జెండా మాత్రమే ఎగురుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement