Thursday, April 25, 2024

పాడి కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి.. విలువల్లేని చిల్లరోడు : అంబటి జోజిరెడ్డి

ఈటల రాజేందర్ ను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఫైర్ అయ్యారు. హుజురాబాద్ లో జరుగుతున్న తాజా చిల్లర రాజకీయాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా జోజిరెడ్డి మాట్లాడుతూ ఈటెలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు సిగ్గుతో తలదించుకోని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈట‌ల రాజేంద‌ర్ ఎదుగుద‌ల‌ను చూసి జీర్ణించుకోలేక కేసీఆర్ కోవ‌ర్టు కౌశిక్ చే ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీ సంస్కరానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఈటల గురించి సోయండి మాట్లాడారా..? లేక వ్యంగంతో అగౌరపరచాలనే మాట్లాడారా ..? అగౌరవపరిచే విధంగా, అసభ్యకరంగా సంబోధించడం ఎంతవరకు సమంజసమనీ ఆయన ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకు, ఓ మాజీ మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా ..? మండిప‌డ్డాడు. ఈటెల రాజేంద‌ర్‌పై పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, హుజురాబాద్ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ ప్రోత్భ‌లంతో కౌశిక్ రెడ్డి కోవర్టుగా మారి హుజరాబాద్ లో చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు, రాజకీయంగా ఈట‌ల‌ను ఎదుర్కోలేక చిల్ల‌ర రాజకీయం చేద్దామనుకుంటే అందుకు తగిన గుణపాఠం త‌ప్ప‌ద‌ని అంబ‌టి జోజిరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి కౌశిక్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. కోవర్ట్ రాజకీయాలతో అడ్డదారిలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ పదవి పొందిన కౌశిక్ రెడ్డి లాంటి విలువలు లేని వ్యక్తిగా అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement