Thursday, May 2, 2024

Bandi Sanjay: ఒవైసీవి ప‌నికిమాలిన కామెంట్స్‌…ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ద్దు…

అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవొద్దని, పట్టు కోల్పోతున్నామనే భయంతోనే ఒవైసీ పనికిమాలిన కామెంట్స్ చేస్తున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమ‌ర్శించారు. శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీ రాముడి అక్షింతలను కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురి ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను అందజేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ హిందుదేవుళ్లంటే ఒవైసీకి చుల‌క‌న అంటూ మండిప‌డ్డారు. రామమందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని వివాద స్ప‌దం చేసే కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 22న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..రాజకీయాలకు అతీతంగా ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే దివ్యమైన, భవ్యమైన రామ మందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు ఆరోజు సాయంత్రం ప్రతి హిందువు తమ తమ ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని ఆయన కోరారు. హిందూ మతం ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement