Thursday, April 25, 2024

డిసెంబ‌ర్ 7న జగిత్యాలకు సీఎం కేసీఆర్.. క‌లెక్ట‌రేట్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిసెంబర్ 7న జగిత్యాల జిల్లా పర్యటనకు రానున్నారు. మొదట జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం రెండు లక్షల మందితో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను ప్రారంభించగా బహిరంగ సభ కోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల, కోరుట్ల శాసనసభ్యులు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావులు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement