Tuesday, May 21, 2024

మున్సిపల్ భవన నిర్మాణ పనులు ప్రారంభం..

పెద్దపల్లి మున్సిపల్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం జిల్లా కేంద్రంలో రూ.5 కోట్ల 84 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భవన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement