Saturday, May 4, 2024

వాహనదారులు అప్రమత్తంగా ఉండండి- డిసిపి అఖిల్ మహాజన్

భారీ వర్షాలతో రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుందని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఆదివారం రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారి పైనుండి ప్రవహిస్తున్న వర్షం నీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని, లేకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. డిసిపి వెంట ఏసిపి సారంగపాణి సిఐలు అనిల్ కుమార్, ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేష్ తో పాటు సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement