Friday, May 3, 2024

నేలకొరిగిన వరి, మొక్కజొన్న..

ముత్తారం: మండలంలోని హరిపురం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న, వరి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి హారిక.. సర్పంచ్‌ వేల్పూరి సంపత్‌రావుతో కలిసి పరిశీలించారు. గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించి రైతులకు కలిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement