Saturday, April 20, 2024

రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు..

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి వారి సన్నిధిలో మూడవ రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజన్న ఆలయ అర్చక బృందం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్తు ద్వారాభిషేకం, సదస్యం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామి వారి సన్నిధిలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల నిర్వహణ కోవిడ్‌ నిబంధన ప్రకారం జరిగిందని ఈఓ కృష్ణప్రసాద్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement