Monday, April 29, 2024

అసలైన రైతు పక్షపాతి కేసీఆర్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

అసలైన రైతు బాంధవుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపినా, రాష్ట్ర రైతాంగం నష్టపోతుందని ఖజానాపై వేలాది కోట్ల రూపాయల భారం పడ్డా యాసంగి వడ్లను పూర్తిగా కొనుగోలు చేస్తామని కెసిఆర్ ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతిదాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ రైతుల పక్షాన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement