Thursday, April 25, 2024

మేడేను విజయవంతం చేయండి..

ఎన్‌టీపీసీ: మేడేను విజయవంతం చేయాలని కోరుతూ ఎన్‌టీపీసీ ఆర్‌ఎఫ్‌సిఎల్‌ గేటు ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. జేఏసీ కన్వీనర్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్‌ మాట్లాడుతూ చికాగో కార్మిక అమరుల స్ఫూర్తితో కార్మికులంతా హక్కుల కోసం ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మాజీ కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు, స్థానిక నిరుద్యోగులకు, భూ నిర్వాసితులకు, మాజీ ఎంప్లాయిస్‌ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్‌ తోకల రమేష్‌, ఏఐటియుసి నాయకులు శనిగల శ్రీనివాస్‌, జేఏసీ నాయకులు రాజేశ్వర్‌, కుమార్‌, మొగిలి, శ్రీకాంత్‌, రాజుశేఖర్‌, శంకర్‌ , చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement