Saturday, May 18, 2024

నిరుపేద కుటుంబానికి చేయూత

సుల్తానాబాద్‌: మండలంలోని సుద్దాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన న్యాతరి సతీష్‌ ఇటీవల మృతిచెందగా ఏగోళపు కుమార్‌గౌడ్‌ ట్రస్టు చేయూతనందించింది. ట్రస్టు చైర్మన్‌ సదయ్య గౌడ్‌ స్పందించి సతీష్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో రంగు రవికుమార్‌ గౌడ్‌, బాలసాని తిరుపతి గౌడ్‌, రంగు సదయ్య గౌడ్‌,దూడం రాము గౌడ్‌,రంగు ప్రవీణ్‌ గౌడ్‌, ఓజ్జె సతీష్‌ ,పురేళ్ల మణికంఠ గౌడ్‌,కాశీపాక సదయ్య, చింతల గోపీ,పోచంపల్లి ఈశ్వర్‌, ఒజ్జ పవన్‌, బిజిలీ ప్రకాష్‌, మచ్చ రాజేష్‌, అవునూరి హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement