Monday, April 29, 2024

రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం.. రామగుండం ఎమ్మెల్యే చందర్

రాష్ట్రంలోని రైతులందరినీ రాజులు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం లోని కుక్కల గూడూర్ భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. తిరిగి వెళుతుండగా రైతులు పొలంలో నాట్లు వేస్తుండగా అక్కడ ఆగి ఎమ్మెల్యే వారితో కలిసి నాట్లు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement