Sunday, May 5, 2024

విధులకు గైర్హాజర్ అయిన ఏఆర్ఎస్ఐ సస్పెన్షన్

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ లోని సిటీ ఆర్ముడ్ రిజర్వ్(సిఏఆర్) విభాగంలో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న జి రమేష్ విధులకు గైర్హాజర్ అయినందుకు సస్పెన్షన్ విధించారు. ఈ మేరకు శనివారం నాడు పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 16న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన శోభాయాత్ర బందోబస్తు విధుల కోసం ఆయన 14న వెళ్ళాల్సి ఉంది. ఆయన అధికారుల ఆదేశాలను విస్మరించి విధులకు గైర్హాజర్ అయ్యారు. దీంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ విధించారు.

క్రమశిక్షణ విస్మరించే పోలీసులపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ స్పష్టం చేశారు. అన్నిస్థాయిలకు చెందిన పోలీసులు క్రమశిక్షణతో మెదులుతూ విధులు నిర్వహించాలని సీపీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement