Tuesday, May 21, 2024

జూలపల్లి టు పెద్దపల్లి డబుల్ రోడ్డు మంజూరు.. రూ.19.80కోట్ల నిధులు విడుదల

దశాబ్దాల కళ నెరవేరింది.. పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి నుండి పెద్దపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరైంది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 19.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జూలపల్లి నుండి పెద్దపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ నిధుల విడుదల కోసం ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో నిధులు విడుదల చేసినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. డబుల్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల పక్షాన ఎమ్మెల్యే దాసరి కృతజ్ఞతలు తెలియజేశారు. నిధులు విడుదల చేసినందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement