Sunday, May 19, 2024

జయశంకర్ సేవలు చిరస్మరణీయం : మంత్రులు హరీష్ రావు, ఈశ్వర్

స్వర్గీయ ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ లు పేర్కొన్నారు. జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్ధంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహా ఉద్యమానికి జయశంకర్ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని యువత జయశంకర్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ రఘువీర్ సింగ్,ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్ తో పాటు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement