Thursday, May 9, 2024

భార్య చేతిలో భర్త హతం

రామగుండం : మద్యానికి బానిసై ప్రతి రోజు చిత్రహింసలు పెడుతున్న భర్తను ఇటుక పెల్లతో బాది కట్టుకున్న భార్యే హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లాలోని విలేజ్‌ రామగుండంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో గ్రామానికి చెందిన కల్లెడ మల్లేశం (42) అనే వ్యక్తి భార్య స్వరూపను చితకబాదడంతో భరించలేక సిమెంట్‌ ఇటుక పెల్లతో మల్లేశం తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గత కొన్నేళ్లుగా మల్లేశం మద్యానికి బానిసై ప్రతి రోజు భార్యను చిత్రహింసలు పెట్టేవాడని స్థానికులు పేర్కొన్నారు. గురువారం రాత్రి సైతం గొడవ జరగడంతో స్వరూప తల్లిగారింటికి వెళ్లి తలదాచుకొని శుక్రవారం ఉదయం వచ్చిందని, రాగానే మల్లేశం మరోసారి స్వరూపతో గొడవకు దిగడంతో క్షణికావేశంలో హతమార్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement