Monday, April 29, 2024

కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాలు : మంత్రి కొప్పుల

నిరుద్యోగ యువతీ యువకులు కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిరుద్యోగ యువతీ యువకులకు ఏర్పాటుచేసిన శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రభుత్వం 81 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుందని, నియోజకవర్గంలోని నిరుపేద యువతకు హైదరాబాద్ తరహా శిక్షణ ఉచితంగా అందిస్తున్నామన్నారు. శిక్షణ శిబిరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement