Monday, May 6, 2024

కరోనాతో ఖని న్యాయవాది మృతి

గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతానికి చెందిన న్యాయవాది, నోటరీ వేముల భాస్కర్‌ సోమవారం అర్ధరాత్రి కరొనాతో మృతి చెందారు. గత పది రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. 4 రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ఒక ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి మృతి చెందారు. భాస్కర్‌కు భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు.. ఆయన భార్య కూడా కరానాతో బాధపడుతూ కోలుకుంటోంది. భాస్కర్‌ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో నిర్వహించేందుకు బంధుమిత్రులు ఏర్పాటు- చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement