Monday, April 29, 2024

KNR: గాంధీజీ సేవలు చిరస్మరణీయం.. రాజేందర్

మహాత్మా గాంధీ భారతదేశానికి అందించిన సేవలు చీరస్మరణీయమైనవని ఆర్యవైశ్య కరీంనగర్ పట్టణ అధ్యక్షులు నగునూరి రాజేందర్ తెలియజేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ పోరాటంలో గాంధీజీ పాత్ర కీలకమైందన్నారు. ఉప్పు సత్యాగ్రహ దీక్ష చేపట్టి అహింసా మార్గంలో బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వాతంత్రం అందించారన్నారు. యువత గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement