Friday, May 3, 2024

బ్లాక్ లో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల అమ్మ‌కాలు – న‌లుగురు అరెస్ట్…

కరీంనగర్‌ : రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను కరీంనగర్‌ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జిల్లాలో కొందరు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు విశ్వ‌స‌నీయ‌ సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టి పోలీసులు ఓ బాధిత కుటుంబానికి ఒక్కో ఇంజక్షన్‌ను రూ. 25 వేలకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా న‌లుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు, రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement