Sunday, April 28, 2024

TS : రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఈశ్వర్

ముస్లిం సోదరులకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పవిత్ర రంజాన్ తెలియజేశారు. గురువారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లిలో ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ముస్లిం సోదరులను చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు అత్యంత పవిత్రంగా 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన అనంతరం పవిత్ర రంజాన్ వేడుకల్లో పాల్గొంటారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజలను అల్లా చల్లంగా చూసి సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దాసరి ఉష తో పాటు పనులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement