Tuesday, April 30, 2024

భూమి పత్రాల ఫోర్జరీ.. కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం

తన భూమి పత్రాలు అధికారులు ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన రామచంద్రరావు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం త‌న ఫోర్జ‌రీ ప‌త్రాల గురించి అధికారులను కలిసేందుకు పెద్దపల్లికి రాగా.. ఎవరూ పట్టించుకోలేదని మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. రామచంద్రరావు తీవ్రంగా గాయపడడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఉందని, ఇందులో పత్రాలను అధికారులు ఫోర్జరీ చేశారని రామచంద్రరావు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement