Sunday, May 5, 2024

ఎల్లమ్మ తల్లికి పట్టు వస్రాలు..

జూలపల్లి: మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లికి ఎన్‌ఆర్‌ఐ కొలుముల దామోదర్‌ పుస్తెమట్టెలను అందించారు. కొత్తూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ దామోదర్‌ ఎల్లమ్మ తల్లికి పుస్తెమట్టెలు, పట్టు వస్త్రాలను సమర్పించినట్లు గౌడ సంఘం అధ్యక్షుడు అమరగాని ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. మే 2 నుంచి నిర్వహించనున్న రేణుక మాత ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు, పట్నాల నిర్వహణకు సహకరించాలని కోరగా రూ. 20వేలతో పుస్తెమట్టెలు చేయించినట్లు వివరించారు. అనంతరం దామోదర్‌ తల్లిదండ్రులు మల్లమ్మ, పెద్ద గంగయ్యలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు అమరగాని రాజేశం గౌడ్‌, పరుశరాములు గౌడ్‌, లక్ష్మీరాజం గౌడ్‌, తిరుపతి గౌడ్‌, మల్లేశం గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement