Saturday, May 4, 2024

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ : సీపీ సుబ్బారాయుడు

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లాలోని సీఎం దత్తత గ్రామమైన చిన్నముల్కనూరులో 50 సీసీ కెమెరాలు ఎమ్మెల్యే సతీష్ బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీఎం దత్తత గ్రామమైన చిన్న ములకనూరులో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్తవినిత శ్రీనివాస్ రెడ్డి, ఏసిపి కరుణాకర్ రావు సిఐ రమేష్, ఎస్సై దాస సుధాకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement