Sunday, April 28, 2024

సిలిండర్ ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోంది  : మంత్రి గంగుల‌

కేంద్ర ప్ర‌భుత్వం సామాన్యుల‌పై పెను భారం మోపుతోంద‌ని, బీజేపీ పాల‌న‌లో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాల‌న్ని అంటుతున్నాయ‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయ‌కులు కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో ధర్నా చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి గంగుల క‌ట్టెల పొయ్యి పై వంట వండి నిరసన వ్యక్తం చేశారు. సిలిండర్ ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోంద‌న్నారు. వెంట‌నే పెంచిన గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణ రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement