Friday, May 17, 2024

వ్యాక్సినేషన్‌ సద్వినియోగం..

కాల్వశ్రీరాంపూర్‌: మండలంలోని గ్రామాల్లో నిర్వహించే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ క్యాంపులను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీడీవో కిషన్‌ నాయక్‌ పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే టీకా క్యాంపులు 22న ఆరెపల్లి, 23న గంగారం, 24న మీర్జంపేట, 25న మొట్లపల్లి, 26న మల్యాల గ్రామాల్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు టీకాలు వేయనున్నట్లు వివరించారు. 45 ఏళ్లు పైబడిన వారంతా ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తప్పనిసరి టీకాలు వేసుకోవాలని సూచించారు. టీకా వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శ్రీరామరక్షగా ఉంటుందన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు క్యాంపు నిర్వహణకు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement