Monday, April 29, 2024

6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ప‌ట్టివేత

సైదాపూర్ : పీడీఎస్ బియ్యాన్ని తరలించరాదని, అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని ఎస్సై చల్ల మధూకర్ రెడ్డి సూచించారు. రేకుర్తికి చెందిన చింతల ఆంజనేయులు తన ఆటోలో గురువారం రాత్రి అందిన‌ సమాచారం మేరకు హుజూరాబాద్ నుండి కరీంనగర్ కు అక్రమంగా సుమారు 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు TS 03 UA 0835 అను ఆటోను సైదాపూర్ గ్రామ శివారులో తనిఖీ చేయగా అందులో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి, ఆటోను అదుపులోకి తీసుకుని ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, లేని యెడల జరిమానా తప్పదన్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులపై ఒక్కొక్క‌రికీ వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. వాహనాలు తనిఖీ చేయగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement