Tuesday, May 21, 2024

సీఎం కేసీఆర్‌ కోలువాలని ప్రత్యేక పూజలు..

గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెరాస అధినేత సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకోవాలని ఆర్జీ1 ఏరియా జీడీకే2 ఇంక్లయిన్‌ గని మైసమ్మ తల్లికి టీబీజీకేఎస్‌ సీనియర్‌ నాయకులు పెంచాల తిరుపతి, పిట్‌ కార్యదర్శి దాసరి నర్సయ్యల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఉద్యమ నేత, సింగరేణి కార్మికులను బార్డర్‌లో సైనికులతో పోల్చిన మహా నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు. ఆయన కరోనా నుంచి కోలుకొని రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేషగిరి, మండ రమేష్‌, వెంకటరెడ్డి, మల్లేశ్‌, తిరుపతి, ఐలయ్య, సతీష్‌, వెంకటేష్‌, రాజేష్‌, ప్రభాకర్‌, గట్టయ్య, ప్రసాద్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement