Tuesday, April 30, 2024

కరోనా నివారణకు చర్యలు..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని పలు గ్రామాలలో సోకిన కరోనా నివారణకు అధికారులు, నేతలు చర్యలు చేపట్టారు. బొప్పాపూర్ లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పలు వార్డుల్లో, వీధుల్లో గ్రామపంచాయతీ సిబ్బందిచే స్ప్రే చేయించారు. అలాగే గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, అక్కపల్లి గ్రామాలలో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేసి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. అయినా గ్రామాలలోని హోటళ్ళ వద్ద, పలు కూడళ్లలో ప్రజలు గుంపులుగా ఉంటున్నారు. ప్రజలందరికి అవగాహన కల్పించి ఇళ్లలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement